భారత్లో రోడ్డు ప్రమాదాలు లక్షల మందిని బలితీసుకుంటున్నాయి. అంతకు నాలుగింతల మందిని తీవ్రంగా గాయపర్చి అంగవైకల్యాన్ని మిగుల్చుతున్నాయి. రోడ్డు ప్రమాద మరణాల్లో వర్కింగ్ ఏజ్ గ్రూప్ 18-60 ఏళ్ల మధ్య ఉన్నవారే అత్యధికంగా ఉండడం ఆందోళన కల్గిస్తోంది. అయితే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అంశాల్లో 'అతి వేగం' మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో రాంగ్ రూట్లో డ్రైవింగ్ నిలిచింది.