కిర్గిస్థాన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో పడి అనకాపల్లికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి దాసరి చందు (21) మృతి చెందాడు. కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న చందు ఏపీకి చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఆదివారం స్థానిక జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. సరదాగా జలపాతంలోకి దిగగా ఊహించని విషాదం జరిగింది. జలపాతంలో గడ్డకట్టిన మంచులో కూరుకుపోయిన చందు బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.