ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు కుటుంబానికి సంబంధించిన కంపెనీల షేర్ల విలువ భారీగా పెరుగుతోంది. మే 23న హెరిటేజ్ ఫుడ్స్ ఒక్కో షేర్ విలువ రూ.354.5 ఉండగా ప్రస్తుతం డబుల్ అయ్యింది. మే 23న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి(24.37%), కుమారుడు నారా లోకేశ్ (10.82%) షేర్ల విలువ రూ.1,100 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.1200 కోట్లు పెరిగి రూ.2,300 కోట్లకు చేరింది.