మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో గత మూడు రోజుల నుంచి నిర్విరామంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. శనివారం పండగ వేళ కూడా కార్యక్రమాలు కొనసాగాయి. జీవీఎంసీ కమిషనర్ పి. సంపత్ కుమార్ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మరికొన్ని రోజులపాటు అక్కడే సిబ్బంది సేవలందిస్తారన్నారు.