భారీ వాహనాలకు గుదిబండగా మారిన గ్రీన్ టాక్స్ విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి తగ్గించేందుకు కృషి చేస్తానని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో ట్యాంక్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పల్లాను సత్కరించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తాను గెలిచిన నెలరోజుల్లోనే అగనంపూడి టోల్ ప్లాజాను ఎత్తి వేయించానని చెప్పారు.