మాడుగుల: వాసవి మాత గుడిలో ముగిసిన దసరా ఉత్సవాలు

53చూసినవారు
మాడుగుల: వాసవి మాత గుడిలో ముగిసిన దసరా ఉత్సవాలు
విజయదశమి ఉత్సవాలు పురస్కరించుకొని గత పది రోజులుగా మాడుగుల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారంతో ముగిసాయి. పది రోజులపాటు అమ్మవారు దశావతారాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు అభిషేకాలు మహిళలచే పారాయణం వంటి కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్