శిథిలావస్థలో పాఠశాల భవనం

53చూసినవారు
శిథిలావస్థలో పాఠశాల భవనం
పెద్దబయలు మండలం గుల్లేలు పంచాయతీ గుల్లేలు గ్రామంలోని ఎంపీపీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు మరీ దారుణంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వానికి పలుమార్లు వినతులు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందనలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్