17న పాడేరు లో చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య శిబిరం
అల్లూరి జిల్లా పాడేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 17 తేదీ న చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యాధికారి బ్రహాజీరావు తెలిపారు. పాడేరు, ముంచంగిపుట్టు, జి. మాడుగుల, పెదబయలు, హుకుంపేట, మండలాలకు చెందిన పిల్లలు హాజరై వైద్యపరిక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే వచ్చిన వారికి భోజన సదుపాయం, రవాణా చార్జీలు వస్తామని, తెలిపారు. వివరాలకు9440949196 నెంబరు ను సంప్రదించాలన్నారు.