సాంఘిక దురాచారాలను ఎదిరించిన గొప్ప వ్యక్తి గురజాడ అప్పారావు

72చూసినవారు
సాంఘిక దురాచారాలను ఎదిరించిన గొప్ప వ్యక్తి గురజాడ అప్పారావు
"దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అని ఎలుగెత్తి చాటిన తెలుగు వైతాళికుడు గురజాడ అప్పారావు అని ఇన్చార్జి హెచ్ఎం నారాయణరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రమైన కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురజాడ చిత్రపటానికి పూలమాలవేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. రచయిత, సంఘసంస్కర్త, అభ్యుదయ కవిగా ఆయన జీవించారని, తెలుగు భాషా మహా కవిగా ఉన్నారని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్