అచ్యుతాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన

77చూసినవారు
అచ్యుతాపురం: అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అచ్యుతాపురం మండలం ఖాజీపాలెం, జగ్గన్నపేట, హరిపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కోరిన పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో బాలింతలకు పౌష్టికాహార కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్