భావోద్వేగానికి గురైన నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి

59చూసినవారు
నర్సాపురం టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఎంపీ అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాసవర్మను ప్రకటించారు. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 30 ఏళ్ల కష్టానికి ఫలితమే ఈ గుర్తింపు అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. ఏకంగా పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న బీజేపీ కమలం పువ్వు గుర్తుపై పడి ఆనంద భాష్పాలను కార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్