ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హరక్ సింగ్ రావత్కు ఈడీ మరోసారి PMLA కింద సమన్లు జారీ చేసింది. ఆయనను ఏప్రిల్ 2న విచారణకు హాజరుకావాలని చెప్పింది. ఆయనకు గతంలోనే అటవీ శాఖ భూమిని అక్రమంగా ఆక్రమించడం, కార్బెట్ నేషనల్ పార్క్లో చెట్లను అక్రమంగా నరికివేసిన కేసులో సమన్లు జారీ చేసింది. అయితే, ఆ విచారణకు హరక్ సింగ్ హాజరుకాలేదు.