ఆస్పత్రి నుంచి సద్గురు డిశ్చార్జ్

74చూసినవారు
ఆస్పత్రి నుంచి సద్గురు డిశ్చార్జ్
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న ఆయన మార్చి 17న ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కోలుకోవడంతో ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుని తరువాత తన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్