పట్టపగలు బ్యాంకును దోచేసిన దొంగలు (Video)

50చూసినవారు
రాజస్థాన్‌లోని బరన్‌ జిల్లాకు చెందిన యూకో బ్యాంక్‌లో పట్టపగలే దొంగలు బ్యాంకును దోచేశారు. బుధవారం మధ్యాహ్నం బార్‌గావ్‌ ప్రాంతంలో ఇద్దరు దుండగులు ముసుగుల ధరించి బ్యాంకులోకి చొరబడ్డారు. తుపాకులతో హల్‌చల్ చేశారు. చంపుతామంటూ బెదిరించి రూ.10 లక్షలు దోచుకొని పోయారు. ఇదంతా బ్యాంకులోని సిసిటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్