1న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

68చూసినవారు
1న ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
విశాఖలోని పాండురంగాపురం బీచ్ రోడ్డులో గల ఏయూ యోగా విలేజ్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తామని డైరెక్టర్ ప్రొఫెసర్ కే. రమేష్ బాబు శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలు నుంచి మధ్యాహ్నం 11 గంటలు వరకు జరుగుతుందన్నారు. అన్ని రకాల వ్యాధులకు ఈ శిబిరంలో వైద్యం చేస్తారని తెలిపారు. కేజీహెచ్ పూర్వ సీనియర్ వైద్యాధికారి కే. ఈశ్వర రావు ఆధ్వర్యంలో రోగులను పరీక్షించి మందులు అందజేస్తారన్నారు.