అప్పన్న భక్తుల కోసం ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

66చూసినవారు
విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి శనివారం ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ. కోటి 65 లక్షలు. ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో ఒక్కో బస్సును రెండున్నర గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేస్తుంది.

సంబంధిత పోస్ట్