కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

54చూసినవారు
కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
బతుకుదెరువు కోసం వలస వచ్చి ప్రమాదాల బారిన పడి అర్ధాంతరంగా మరణిస్తున్న భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి పేర్కొన్నారు. శనివారం అనంతపురం నగరంలోని వన్ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ను ఆయన కలిశారు. సాకే హరి మాట్లాడుతూ.. ప్రమాదంలో చనిపోయిన ఆంజనేయులు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఐను కోరారు.

సంబంధిత పోస్ట్