ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కు రసీదులు ఇవ్వాలి: విజయ్ భాస్కర్

67చూసినవారు
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కు రసీదులు ఇవ్వాలి: విజయ్ భాస్కర్
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ విషయం లో నెలకొన్న సమస్యలు తీర్చాలని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ ని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఫారంను ఎన్నికల అధికారులకు అందచేసినా కూడా రసీదు ఇవ్వకపోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్