ఏపీ రాజకీయాలు ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటా: కేతిరెడ్డి

75చూసినవారు
వైసీపీని వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి స్పందించారు. ఏపీ రాజకీయాలు ఉన్నంతవరకు తాను వైసీపీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 35 ఏళ్లుగా తమ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో కలిసి ఉందన్నారు. ఇతర పార్టీలోకి తాను చేరుతున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని, వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్