నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోండి

83చూసినవారు
నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోండి
ధర్మవరంలో ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం ధర్మవరంలోని ఎంఈఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారిణి రాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో పొందుపరచాలని, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్