టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సారథ్యంలో ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీని గుమ్మనూరుసోదరులు బ్రష్టు పట్టించేలా నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదని టిడిపి బిసిసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్ గౌడ్ హితువుపలికారు. గుమ్మనూరు జయరామ్ సోదరుడు నారాయణ టిడిపి పార్టీ కార్యాలయం ప్రారంభిస్తామని ప్రకటన చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని జితేంద్రగౌడ్ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.