
గార్లదిన్నె లో బెదిరింపులపై ఫిర్యాదు
గార్లదిన్నె మండలం కనంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం ఫోన్ చేసి పరుష పదాలతో తిడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోందని అదే గ్రామానికి ప్రసాద్ ఎస్ఐ గౌస్ బాషా కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల కిందట సదరు మహిళకు, ప్రసాద్ కుటుంబానికి స్థలం విషయంలో సమస్యలు ఉండేవన్నారు. ఈ క్రమంలో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ప్రసాద్ ఆరోపించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.