మన కుటుంబాల బంగారు భవిష్యత్తు, కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ది జగనన్నతోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తెలియజేశారు. ఆదివారం కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామానికి చెందిన 6 కుటుంబాలు ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా ఉమామహేశ్వర నాయుడు వైసిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.