కళ్యాణదుర్గం: కన్నుల పండుగగా వాసవి మాత ఉయ్యాల ఉత్సవం

77చూసినవారు
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం కళ్యాణదుర్గం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ఉయ్యాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అలంకరించిన ఉయ్యాలలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి ఆర్యవైశ్య మహిళల ఆధ్వర్యంలో ఉయ్యాల ఉత్సవం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ఉయ్యాల ఉత్సవాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్