ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం

75చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం
కళ్యాణదుర్గం పట్టణంలోని ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 54వ జాతీయ సేవా దినోత్సవం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ‌ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇన్ ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజ రాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు సేవా గుణము అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీఓ డాక్టర్ శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్