దుర్గంలో పనిచేయని స్టేట్ బ్యాంక్ - ఆందోళనకు దిగిన కస్టమర్లు

85చూసినవారు
కళ్యాణదుర్గంలోని మెయిన్ స్టేట్ బ్యాంక్ బుధవారం సుమారు 2గంటల పాటు పనిచేయలేదు. దీంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. బ్యాంకు ఉద్యోగులతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. కరెంటు లేకపోవడం వల్ల సర్వర్లు, కంప్యూటర్లు పని చేయలేదని బ్యాంకు ఉద్యోగులు సమాధానమిచ్చారు. జనరేటర్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని కస్టమర్లు ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. కస్టమర్లకు అధికారులు సర్ది చెప్పి వివాదాన్ని సద్దుమణించారు.

సంబంధిత పోస్ట్