![సజావుగా ముగిసిన ఎన్నికల పోలింగ్ సజావుగా ముగిసిన ఎన్నికల పోలింగ్](https://media.getlokalapp.com/cache/67/41/674121682301b09280765780455e2208.webp)
సజావుగా ముగిసిన ఎన్నికల పోలింగ్
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల వ్యాప్తంగా సోమవారం సజావుగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం నుండి ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. మొదటి సారిగా ఓటు హక్కు కలిగిన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నల్లచెరువు మండల వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి సంఘటనలు జరగకుండా మండల ఎస్ ఐ లింగన్న పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.