దోమల బెడద నుండి కాపాడండి

78చూసినవారు
సోమందేపల్లి బాలాజినగర్ లోని రంగా థియేటర్ వెనుక ఉన్న ప్రదేశంలో మురికి నీరు చేరుకొని దోమలకు నిలయమైందని స్థానికులు పేర్కొన్నారు. దీంతో విష జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పంచాయితీ వారికి ఈ విషయం ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల బెడద నుంచి తమను రక్షించాలని కోరుకుతున్నారు.

సంబంధిత పోస్ట్