సోమందేపల్లి మండలం నాగినాయని చెరువులో కొన్ని రోజులుగా నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి ఉషశ్రీ చరణ్ను కలిసి తమ గ్రామంలో నీటి సమస్య గురించి వివరించారు. మంత్రి వెంటనే స్పందించి శుక్రవారం కొత్త మోటారు, పంపు, పైపులు, మీటర్ పెట్టి, కేబుల్ వైరు మెటీరియల్ మొత్తం అందించి నీటి సమస్యను పరిష్కరించారు. దీంతో గ్రామస్థులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.