రాజ్‌కోట్‌ టెస్టు.. కుల్‌దీప్‌, జడేజా ఔట్‌

1085చూసినవారు
రాజ్‌కోట్‌ టెస్టు.. కుల్‌దీప్‌, జడేజా ఔట్‌
రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 89.4 ఓవర్‌ వద్ద అండర్సన్‌ వేసిన బంతికి కుల్‌దీప్‌ యాదవ్‌ (4) వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. తర్వాతి ఓవర్లో 90.5 వద్ద రవీంద్ర జడేజా (112) ఔటయ్యాడు. దీంతో తొలి సెషన్‌ ప్రారంభంలోనే భారత్‌ రెండు వికెట్లు చేజార్చుకుంది. క్రీజులో అశ్విన్‌ (7), ధ్రువ్‌ జురెల్‌ (8) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్