బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు రోజురోజుకు తీవ్రతర మవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. బారియా జిల్లాలోని పైక్పారా ప్రాంతంలో ఏర్పాటు చేసిన సరస్వతి మండపంపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. దేవత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధిత హిందువులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.