వరద బాధితులకు అండగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్

80చూసినవారు
వరద బాధితులకు అండగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఈనెల 11న శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్ జె రత్నాకర్ నేరుగా పాల్గొంటారని నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 7000 కుటుంబాలకు రత్నాకర్ చేతుల మీదుగా అమృత కలశాల కిట్లు 19రకాల నిత్యావసర వస్తువులతో పాటు ఒకచీర పంపిణీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్