ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి
సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం వెంకటాపురం పంచాయతీ, రెడ్డివారి పల్లి పాముదుర్తి పంచాయతీలో శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.