రాయదుర్గం పట్టణములో గురువారం సాయంత్రం వింత ఘటన చోటుచేసుకుంది. కోటలో వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపాన మూగ జీవాల్లో తారతమ్యం మరచి తల్లి ప్రేమను చాటిన ఓ మేక. ఎనుము దూడకి ఆకలి కావడంతో అక్కడే ఉన్న మేక పాలు తాగింది. దీంతో మేక ఏమాత్రం బెదరకుండా ఆ దూడ కడుపు ఆకలి తీర్చి తల్లి ప్రేమను చాటింది. ఈ వింత అయిన ఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించి ఆచర్యపోయారు.