నూతనంగా ఎన్నికైన ఎంపీలతో
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదిక కానుంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎంపీలు హాజరు కానున్నారు. ఎన్డీయే ఎంపీల సమావేశంలో నూతన ఎంపీలు తమ నేతగా మోదీని ఎన్నుకుంటూ తీర్మానం చేయడంతో పాటు తీర్మాన ప్రతిని సంకీర్ణ నేతలు రాష్ట్రపతికి అందించనున్నారు.