భక్తులతో కిక్కిరిసిన షిరిడి సాయినాధుడి ఆలయం

55చూసినవారు
రాయదుర్గం పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు వేకువ జామున నుండే బారులు తీరారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు జయంతి రాధాకృష్ణ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. సాయంకాలం సాయినాధుడు చిత్రపటంతో ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్