టీడీపీ నుండి వైసిపిలోకి 30 కుటుంబాలు చేరిక
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండల పరిధిలోని తురకలాపట్నంలో 23 కుటుంబాలు, బుచేర్ల పంచాయతీ నుండి 7కుటుంబాలు మొత్తం 30కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీ లోకి మంత్రి కే. వి. ఉషాశ్రీచరణ్ సమక్షంలో మంగళవారం చేరారు. ఈ సందర్బంగా పార్టీలోకి చేరిన వారికి మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.