వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడుతూ 'పూర్తి మద్యపాన నిషేధమన్నారు.. ఏమైంది? జగన్ సర్కారే మద్యం అమ్ముతోంది. వాళ్ళు ఏ బ్రాండ్ పెడితే అవే తాగాలట. ప్రపంచంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఏపీలో పెట్టారు. ప్రజలు నాసిరకం లిక్కర్ తాగి కిడ్నీలు దెబ్బతిని చనిపోతున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా మాఫియాలే. వేల కేజీల్లో డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి' అని వైఎస్ షర్మిల ఆరోపించారు.