Feb 18, 2025, 14:02 IST/బాన్సువాడ
బాన్సువాడ
బాన్సువాడలో ఎమ్మెల్సీ అభ్యర్థి భార్య గోదావరి ప్రచారం
Feb 18, 2025, 14:02 IST
బాన్సువాడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకు మద్దతుగా మంగళవారం ఆయన సతీమణి గోదావరి పట్టభద్రులను కలిసి భర్త గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తుప్తి ప్రసాద్, బాపురెడ్డి, మోహన్ రెడ్డి, శంకర్ గౌడ్, కోణాల గంగారెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.