పరిశుభ్రతతో రోగాలు దూరం

83చూసినవారు
పరిశుభ్రతతో రోగాలు దూరం
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఆయన పెద్దపప్పూరు మండలం జూటూరు కస్తూర్బా పాఠశాల, బీసీ బాలికల వసతి గృహం, పెద్దపప్పూరు బాలుర వసతి గృహంలో దోమల నివారణ కోసం మందు పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దోమల నివారణ చర్యలను వివరించారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్