T20 WC 2024 మెగాటోర్నీ సెమీఫైనల్స్ సమరానికి సమయం ఆసన్నమైంది. ఈ సమరానికి భారత్ సిద్ధమైంది. జార్జ్ టౌన్ వేదికగా జరిగే మ్యాచ్ లో నేడు ఇంగ్లాండ్ తో భారత్ తలపడనుంది. అయితే జార్జ్ టౌన్ లోని పిచ్ బౌలింగ్ కు సహకరిస్తోంది. ఇక్కడ పేసర్లు 14.7, స్పిన్నర్లు 14.5 సగటు నమోదు చేశారు. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ మరింత మందకొడిగా మారి బ్యాటింగ్ కు పరిస్థితులు కఠినమవుతాయి. అందుకే టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్ కు మొగ్గు చూపొచ్చు.