యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి

78చూసినవారు
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యాడికి అప్ గ్రేడ్ పీఎస్ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. బుధవారం యాడికి మండల కేంద్రంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలతో జీవితం అంధకారమవుతుందన్నారు. యువత చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్