ప్రమాదవశాత్తు నిప్పంటుకొని గడ్డివాము దగ్ధం

24414చూసినవారు
ఉరవకొండ మండలం చిన్నముష్టురులో ఎల్లప్ప అనే రైతుకు చెందిన గడ్డివాముకు ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కాలిపోయింది. వెంటనే గమనించిన రైతు ఎల్లప్ప, గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన గ్రామానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దాదాపు రూ. 50 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. పశువులకు వేసేందుకు మేత కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్