సిరికల్చర్ ఏడికి బహుజన యువసేన వినతి

53చూసినవారు
మదనపల్లె సిరికల్చర్ ఏడి సరోజకు శుక్రవారం బహుజన యువసేన నేత పూణీత్ వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పట్టుపరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అర్హులకు రీలింగ్ అండ్ ట్విస్టింగ్ యూనిట్లు ఇస్తోంది. ఆ యూనిట్ల కోసం ఇస్తున్న స్థలాలను అర్హులకు కాకుండా అధికారులు గతంలో అనర్హులకు ఇచ్చారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అర్హులకు స్థలాలు కేటాయించకుంటే ఉద్యమిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్