ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సిద్ధం బస్సు యాత్ర ద్వారా వైసీపీ నాయకులు, కార్యకర్తలకు సీఎం జగన్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మదనపల్లెలో సభ ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఆయన పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు రోజుల పాటు బస్సు యాత్ర జరుగుతుందని చెప్పారు. మదనపల్లెలో మంగళవారం సభను విజయవంతం చేయాలని కోరారు.