స్కూటర్ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు

67చూసినవారు
స్కూటర్ ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. రామారావు కాలనీకి చెందిన సతీష్, కార్తీక్, వినోద్ ముగ్గురు స్నేహితులు బైకు నడపడానికి రామారావు కాలనీ నుంచి ఆర్ ఆర్ కళ్యాణ మండపం సమీపంలోని బైపాస్ రోడ్డుకు వచ్చారు. ముగ్గురు రోడ్డు పక్కన నిలబడి ఉండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని వెళ్లిపోయింది. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్