మిట్టా జువెల్లెర్స్ లో భారీ చోరీ

73చూసినవారు
మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్డు మిట్టా జ్యువెలర్స్ లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున మధ్య భారీ చోరీ జరిగినది. కేజీ బంగారం, పెద్ద ఎత్తున వెండి వస్తువులను దొంగలు దోచుకు వెళ్లారు. దుకాణం వెనక నుండి బాత్రూమ్ కు రంద్రం వేసి దుకాణంలోకి దొంగలు చొరబడ్డారు. దొంగలు సీసీ కెమెరా హార్డ్ డిస్క్ ను సైతం లేకుండా పగులకొట్టి తీసుకెళ్లారు. గత రెండు రోజుల నుండి దుకాణాన్ని యజమాని తెరవకపోవడంతో అదును చూసి దొంగతనంకు పాల్పడ్డారు.

సంబంధిత పోస్ట్