పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం...

60చూసినవారు
పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం...
మైదుకూరు మండలం మిట్టమాను పల్లెకు చెందిన నానుబాల వెంకటేశ్వర్లు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో గురువారం ఉదయం మిట్టమానుపల్లెకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. నానుబాల వెంకటేశ్వర్లు జెసిబి ఆపరేటర్ గా జీవనం సాగిస్తున్నాడు. జెసిబి ఓనర్ కి ఫోన్ చేసి నేను చనిపోతున్నానని చెప్పగా ఓనర్ పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్