తంబళ్లపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ఎంఎన్. చంద్రశేఖర్ రెడ్డి ఈనెల 22వ తేది సోమవారం తన నామినేషన్ వేయనున్నట్లు పిటియం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా సోమవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పిటీఎం నుంచి తంబళ్లపల్లికి ర్యాలీగా వెళ్లి ఎంఎన్. చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని వారు తెలిపారు.