

శ్రీనగర్ నుంచి హజ్ యాత్రకు పయనమైన రెండో బృందం (వీడియో)
జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ నుంచి మక్కాకు రెండో విడత హజ్ యాత్రికులు బుధవారం బయలుదేరారు. మే 4న తొలి బ్యాచ్ మక్కా వెళ్లింది. భారత్, పాకిస్థాన్ పరస్పర అవగాహన అనంతరం ఈ యాత్ర కొనసాగుతోంది. మొత్తం 642 మంది యాత్రికులు శ్రీనగర్ నుంచి మక్కా వెళ్తున్నారని జమ్మూ కశ్మీర్ హజ్ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు శుజాత్ అహ్మద్ ఖురేషి తెలిపారు. ఇందుకోసం 6 విమానాలను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.